ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ హవాను తట్టుకున్న ఏకైక నాయకుడు

by Disha Web Desk 12 |
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ హవాను తట్టుకున్న ఏకైక నాయకుడు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 40 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించింది. కాంగ్రెస్ నాయకుల దెబ్బకు బీఆర్ఎస్ అభ్యర్థులు కుదేలయ్యారు. కానీ సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి.. కాంగ్రెస్ హవాను తట్టుకుని నిలిచాడు. మొదటి రౌండ్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న ఆయన కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పై 4238 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే ఉమ్మడి నల్లగొండను క్లీన్ స్వీప్ చేయాలని ఆశించిన కాంగ్రెస్ కు అడ్డంకిగా జగదీశ్వర్ రెడ్డి మారారు.



Next Story

Most Viewed