- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జిల్లా అంత కూడా లేని పాకిస్థాన్ వెనక్కి తగ్గడమే మేలు.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో ఒక జిల్లా అంత కూడా లేని పాకిస్థాన్ వెనక్కి తగ్గడమే మంచిది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. భారత్ -పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. భారత సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్ దాడులకు యత్నిస్తోండగా.. వాటిని భారత ఆర్మీ ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు పరిస్థితులపై మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. పాకిస్థాన్ చర్యలు వారికే చాలా నష్టాన్ని కలిగిస్తాయని తెలిపారు.
పహల్గామ్ లో జరిగిన అమానవీయ ఉగ్రదాడి ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్న ప్రతీ ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. అలాగే భారత ఆర్మీ ఉగ్రవాద శిభిరాలపై దాడులు చేయడం చాలా సమర్థనీయం అని అన్నారు. అంతేగాక పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి భారత సాయుధ దళాలు మంచి పని చేశాయన్నారు. ప్రస్తుతం ఉద్రిక్తత స్థిరంగా కొనసాగుతోందని, ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరితే పూర్తి స్థాయి యుద్దానికి దారి తీస్తుందని వెల్లడించారు. ఈ పరిస్థితులు పాకిస్థాన్ ని నాశనం చేయడానికి దారి తీస్తాయని స్పష్టం చేశారు. అంతేగాక పాకిస్థాన్ మన దేశంలో ఒక జిల్లాగా కూడా ఉంటుందని తాను అనుకోవడం లేదని, కాబట్టి పాకిస్థాన్ వెనక్కి తగ్గడం తెలివైన పని అని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు.