సినిమా ఇండస్ట్రీని తాకిన రైడ్స్ సెగ.. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసుల్లో GST దాడులు..

by Disha Web Desk 12 |
సినిమా ఇండస్ట్రీని తాకిన రైడ్స్ సెగ.. మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసుల్లో GST దాడులు..
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపార సంస్థల యజమానులు ఇండ్లలో ఈ దాడులు జరుగుతున్నాయి. తాజాగా సినిమా ఇండస్ట్రీకి కూడా దాడులు సెగ తగిలింది. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల్లో GST దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా యలమంచలి రవి శంకర్, నవీన్ ఎర్నేని ఇళ్లలో, ముగ్గురు నిర్మాతల ఇళ్ళలో ఈ దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బాలకృష్ణ తో వీర నరసింహారెడ్డి, చిరంజీవితో వాల్తేరు వీరయ్య, త్వరలో రాబోయో పవన్ కళ్యాన్ ఉస్తాద్ భగత్‌సింగ్, అలాగే పుష్ప-2 వంటి భారీ సినిమాలను నిర్మిస్తుంది. ఈ క్రమంలోనే అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారేమో అనే అనుమానాలు ప్రస్తుతం నెలకొన్నాయి.

Read More...

క్యాసినో కేసులో ఈడీ విచారణకు మంత్రి తలసాని పీఏ!

Next Story