నామినేషన్ వేళ IT దాడులు.. పొంగులేటి సంచలన నిర్ణయం

by Disha Web Desk 4 |
నామినేషన్ వేళ IT దాడులు.. పొంగులేటి సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి ఇళ్లు, కార్యాలయాలపై గురువారం తెల్లారు జాము నుంచి ఐటీ దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ దాడులపై సీఈసీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి స్వేచ్ఛకు భంగం కలిగించారని పొంగులేటి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ఐటీ అధికారుల అనుమతితో కాసేపట్లో పొంగులేటి నామినేషన్ వేయనున్నారు. పొంగులేటిపై ఐటీ దాడులను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి కాంగ్రెస్ సీఎల్పీ నేత విక్రమార్క తీవ్రంగా ఖండించారు.

Next Story

Most Viewed