బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నమాట నిజమే: నందీశ్వర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నమాట నిజమే: నందీశ్వర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నది వాస్తవమే అన్నారు. కొంతమంది వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేనన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొద్ది మంది నేతలు దేనికో ఆశపడి పార్టీ అంతర్గత వివరాలను రహస్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేస్తున్నారనే సమాచారం తమకు ఉందన్నారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశానని, రాత పూర్వకంగా సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అర్వింద్ మీనన్ వంటి వారి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.

పార్టీని నమ్ముకుని లక్షలాది మంది కార్యకర్తలు, నేతలు, ప్రజలు ఉన్నారని ఇలాంటి సమయంలో కొంత మంది చేస్తున్న చర్యలకు పార్టీ నష్టపోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఇకనైనా అలాంటి వారు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. పార్టీకి మరింత నష్టం కలిగించాలని చూస్తే అలాంటి కోవర్టుల పేర్లు మీడియా ముందు బయటపెడతానని హెచ్చరించారు. వాళ్ల మీద యాక్షన్ తీసుకోకుంటే అమిత్ షా వద్దకు సైతం వెళ్లి ఫిర్యాదు చేస్తానన్నారు. మరో 15 రోజుల్లో సెన్సేషనల్ న్యూస్ వింటారని చెప్పారు. బీజేపీ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ అని.. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed