- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని నాయకులపై కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా భయపడి లేదని అన్నారు. అధికారం శాశ్వతం కాదని వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్ గా అభివృద్ధి చేయకపోయినా మున్సిపల్ చైర్మన్ తన కూతురుని చేసి అభివృద్ధి చేస్తారని చూస్తే పట్టణంలోని రోడ్లన్నీ అధోగతి ఉన్న గంపెడు మన్ను వేసి గుంతలు పూడ్చిన పాపాన పోవడం లేదని అన్నారు. అభివృద్ధి చేయకుండా అధికారంతో చెలాయించడం సరి అయింది కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి మహేష్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టు రామచంద్రారావు మాజీ మౌలిక విద్యా వసతుల కల్పన చైర్మన్ నాగేందర్ గౌడ్. మాజీ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మండలాల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






