కవిత ప్రజల కోసం వెళ్తున్నట్లు మాట్లాడటం విడ్డురం : DK Aruna

by Disha Web Desk |
కవిత ప్రజల కోసం వెళ్తున్నట్లు మాట్లాడటం విడ్డురం : DK Aruna
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లాల్సి వస్తే అది తను చేసిన అవినీతి వల్ల వెళ్తుందని, కానీ ఆమె ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్తున్నట్లు మాట్లాడటం విడ్డురంగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. టీఆరెస్ నేతలు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతాయనే భయంతో ముందుగానే బీజేపీపై ఎదురు దాడి ప్రారంభించారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల నుంచి సానుభూతి పొందడానికి కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తోందని ఫైరయ్యారు. ఎటువంటి తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ వచ్చినా భయం ఎందుకని ఆమె ప్రశ్నించారు.



Next Story

Most Viewed