ఉప్పల్ స్టేడియంలో వీఆర్ఏల వినూత్న నిరసన..

by Disha Web Desk 13 |
ఉప్పల్ స్టేడియంలో వీఆర్ఏల వినూత్న నిరసన..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంపై వీఆర్ఏలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ 2023లో భాగంగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా వీఆర్ఏలు తెలిసిన వినూత్న నిరసన వైరల్ గా మారింది. ఒక వీఆర్ఏ ప్లకార్డు పట్టుకుని తమకు పేస్కేల్ పెంచాలని డిమాండ్ చేయడం గమనార్హం.

ఒకవైపు క్రికెట్ ప్రేమికులంతా మ్యాచ్ లో మునిగితేలుతుండగా వీఆర్ఏ నిరసన తెలిపడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వాస్తవానికి పే స్కేల్ పై క్లారిటీ ఇవ్వాలని వీఆర్ఏలు రాష్ట్రప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు ధర్నాలు, ముట్డడి సైతం నిర్వహించారు. అయినా ప్రభుత్వం దీనిపై ఇప్పటి వరకు స్పష్టతనివ్వకపోవడం గమనార్హం.


Next Story

Most Viewed