భారత్ జట్టు కప్పు గెలుస్తుంది : అజారుద్దీన్

by Muthe.Rajitha |

నేడు భారత మహిళా జట్టు వన్డే ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

భారత్ జట్టు కప్పు గెలుస్తుంది : అజారుద్దీన్
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు భారత మహిళా జట్టు వన్డే ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ లో భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఈ తుది పోరులో భారత మహిళల టీం భారత మహిళా జట్టు విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని మాజీ క్రికెటర్‌, తెలంగాణ మంత్రి అజారుద్దీన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా సభ్యులు అద్భుతంగా ఆడారని అభినందించారు.

కాగా నేడు జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ లో వర్షం కారణంగా ఇప్పటికే రెండుసార్లు టాస్ వాయిదా పడింది. అయితే ఫైనల్ మ్యాచ్ కావడంతో ఆలస్యం అయినా పూర్తి మ్యాచ్ ను నిర్వహించేందుకు అంపైర్లు సిద్ధంగా ఉన్నాయి. నేడు జరిగే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచినా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ కు కొత్త ఛాంపియన్ గా నిలవనున్నారు.

Next Story