- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ పాలనలో అవినీతికి కాదేది అనర్హం!.. బీఆర్ఎస్ పై టీ కాంగ్రెస్ విమర్శలు
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మరో దారుణం బయటపడిందని, కేసీఆర్ పాలనలో అవినీతికి కాదేదీ అనర్హం అని బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మరో దారుణం బయటపడిందని, కేసీఆర్ పాలనలో అవినీతికి కాదేదీ అనర్హం అని బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు చేసింది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యయం పెరగడంపై స్పందిస్తూ.. అంచనాలు అడ్డగోలుగా పెంచేస్తారా? అని ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనాన్ని పోస్ట్ చేసింది. ఇందులో.. కేసీఆర్ పాలనలో అవినీతికి కాదేదీ అనర్హం. పేదల కోసం కట్టే ఆసుపత్రైనా.. అమరుల కోసం కట్టే స్థూపమైనా, కమీషన్లకు కాదేదీ అనర్హం అని సంచలన ఆరోపణలు చేసింది. ఎలాంటి పత్రం లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా, మౌకిక ఆదేశాలతో.. ఇట్ల చెప్పారని, అట్ల ఏకంగా రూ.626 కోట్లు అంచనాలు పెంచేశారని మండిపడింది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి గారి వరంగల్ పర్యటన సందర్భంగా ఈ దారుణం బట్టబయలైందని, ఈ వ్యవహారం పై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ తెలియజేసింది.






