- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ నిధులు.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan) కు ఐఎంఎఫ్ నిధులు (IMF Funds) మంజూరు చేయడంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (AIMIM MP Asaduddin Owisi) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్థాన్ (Pakistan) కు ఐఎంఎఫ్ నిధులు (IMF Funds) మంజూరు చేయడంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (AIMIM MP Asaduddin Owisi) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్థాన్ కు నిధులు ఇవ్వడం అంటే ఒక ఉగ్రవాద సంస్థకు రుణం ఇవ్వడమేనని హాట్ కామెంట్స్ చేశారు.
పాకిస్థాన్ లో పేదరిక నిర్మూలనకు అంతర్జాతీయ ద్రవ్య నిధి 1 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది. దీనిపై ఎంపీ అసద్ మాట్లాడుతూ.. ఐఎంఎఫ్ ఇచ్చిన నిధులు పాకిస్థాన్ ప్రజలకు ఉపయోగపడవని, భారతదేశానికి వ్యతిరేకంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఇది ఒక ఉగ్రవాద సంస్థకు ఇచ్చిన రుణం అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ కు రుణం ఇవ్వడంపై పశ్చిమ దేశాలు మౌనంగా ఎందుకు ఉన్నాయో అర్థం కావడం లేదని, ఉగ్రవాదానికి సమకూరుస్తున్న నిధులు అని తెలిసే అమెరికా, జర్మనీ, కెనడా దేశాలు మౌనంగా ఉన్నాయని అన్నారు.
పాక్ ఈ నిధులను పేదరిక నిర్మూలనకు, పోలియోపై పోరాటానికి, మహిళల సాధికారతకు ఉపయోగించదని, కేవలం భారతదేశాన్ని అస్థిరపరిచేందుకే ఉపయోగిస్తుందని ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఒక ఫెయిల్డ్ కంట్రీ (Failed Country) అని, దాని వల్ల కలిగే ప్రమాదాన్ని ప్రపంచం గుర్తించాలని సూచించారు. అంతేగాక పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను నిరాయుధీకరించాలని, ఈ ఆయుధాలు మానవాళికి ముప్పు అని ఓవైసీ హెచ్చరించారు.