కవితకు ఏం జరిగినా దేశం అగ్నిగుండమే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
కవితకు ఏం జరిగినా దేశం అగ్నిగుండమే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ గురువారం ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ స్పందిస్తూ కవితకు ఏం జరిగినా దేశం అగ్నిగుండమే అన్నారు. మహిళా బిల్లు కోసం దేశ వ్యాప్తంగా కవిత మద్దతు కోరడంతోనే ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. లక్షల కోట్లు విదేశాలకు వెళ్తే పట్టుకోవడం లేదని, మహిళా బిల్లు కోసం కవిత గొంతు ఎత్తగానే కేంద్రం భయపెట్టాలని చూస్తోందన్నారు. కవిత ఒక శక్తి అని కేసీఆర్ కుటుంబం అంటే తెలంగాణ కుటుంబం అన్నారు.


Next Story