27 చాలదనుకుంటే అదనంగా మరో 21 శాతం డిస్కౌంట్.. ఉగాది ఆ ఆఫర్లు చూసి నెటిజన్లు షాక్

by Disha Web Desk 13 |
27 చాలదనుకుంటే అదనంగా మరో 21 శాతం డిస్కౌంట్.. ఉగాది ఆ ఆఫర్లు చూసి నెటిజన్లు షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాది పండగ వచ్చేస్తోంది. ఈ పండగను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు స్పెషల్ గా జరుపుకుంటుంటారు. ఉగాది పర్వదినాన తెల్లవారుజామునే లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. అయితే మారుతున్న జీవనపరిస్థితుల కారణంగా పండగ పూట ఉచితంగా లభించే వస్తువులు, సామాగ్రి ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఉగాది పండగ వేల గుమ్మాలకు కట్టుకునే మామిడాకులు ఆన్ లైన్ లో అమ్ముతుండటం ఆసక్తిని రేపుతున్నది. మామిడాకులు చాలా కాలంగా ఆన్ లైన్ లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు విక్రయిస్తుండగా ఈసారి ఉగాది పండగకు ముందు భారీ ఆపర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో ఈ ఆఫర్లపై నెటిజన్లు సెటైరికల్ గా రియాక్ట్ వుతున్నారు. బిగ్ బాస్కెట్ లో మాడిడాకులు 27 శాతం డిస్కౌంట్ తో రూ.69 కి వస్తుడంగా దీనికి పోటీగా మరో ఈ కామర్స్ సంస్థ జెప్టో 21 డిస్కౌంట్ తో కేవలం రూ. 48కే అందజేస్తోంది. ఈ డిస్కౌంట్స్ ను చూస్తున్ననెటిజన్లు మీ ఇంటి గుమ్మానికి కట్టేందుకు మామిడాకులు కావాలా ఇంకెందుకు ఆలస్యం బిగ్ బాస్కెట్ లో జెప్టోనో ఆర్డర్ చేయండి. ఇదంతా కలికాలం అంటూ అంటూ సెటైరికల్ గా రియాక్ట్ అవుతున్నాయి. వెంటనె ఈ మామిడి కొమ్మలను బుక్ చేసుకోవాలని లేకుంటే రాబోయే రోజుల్లో వీటి రేటు మరింత పెరిగుతుందని ఇంటర్నెట్ లో చర్చించుకుంటున్నారు.కాగా వచ్చే నెల తొమ్మిదవ తేదీన ఉగాది పండగ జరుపుకోబోతున్నారు.



Next Story

Most Viewed