నేను మాట్లాడింది తెలంగాణలో సాధారణ భాషే : బండి సంజయ్

by Disha Web Desk 4 |
నేను మాట్లాడింది తెలంగాణలో సాధారణ భాషే : బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. మహిళా కమిషన్ సభ్యులు తన స్టేట్ మెంట్‌ను రికార్డు చేసుకున్నారని తెలిపారు. నేను మాట్లాడింది తెలంగాణలో మాట్లాడే సాధారణ భాషే అన్నారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇదే అంశమై మహిళా కమిషన్ ఎదుట ఆయన ఈ రోజు వివరణ ఇచ్చారు. బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి కమిషన్ కార్యాయాలయానికి బండి సంజయ్ వెళ్లారు. ఇటీవల కవితపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Also Read...

TSPSC లీకేజీ వ్యవహారం: అభ్యర్థులకు KTR కీలక సూచన


Next Story

Most Viewed