టీడీపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. కార్యాలయం కూల్చివేత

by Ajay Maddhiboyina |

టీడీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్ ఇచ్చింది.

టీడీపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. కార్యాలయం కూల్చివేత
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్ ఇచ్చింది. హఫీజ్ పేటలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న క్రమంలో ఎమ్మెల్యేకు చెందిన 17 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఇందులో ఎమ్మెల్యేకు సంబంధించిన కార్యాలయం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం రూ.2వేల కోట్ల విలువైన భూ ఆక్రమణలను హైడ్రా అడ్డుకున్నట్టు తెలుస్తోంది. కూల్చివేత‌ల‌పై వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ స్పందించారు. 2005లో ఈ భూమిని కొనుగోలు చేసిన‌ట్టు ఆయ‌న చెబుతున్నారు. ఈ భూమిపై ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని రంగారెడ్డి క‌లెక్ట‌ర్ నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ ఇచ్చిన‌ట్టు చెప్పారు. స్వ‌యంగా హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ను కలిసి భూమికి సంబంధించిన పత్రాలను సమర్పించినట్టు తెలిపారు. అయినప్పటికీ హైడ్రా అధికారులు తమ ఆఫీసు మొత్తాన్ని కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story