సికింద్రాబాద్లో యువ ఓటర్లే కీలకం.. పార్టీల దృష్టి వారిపైనే..!

by Dishafeatures2 |
సికింద్రాబాద్లో యువ ఓటర్లే కీలకం.. పార్టీల దృష్టి వారిపైనే..!
X

దిశ, మెట్టుగూడ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కానున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో యువత ప్రధాన భూమికను పోషించబోతుంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో ఓటర్ల జాబితాను పరీశీలిస్తే 60 శాతం వరకు యువ ఓటర్లు ఉన్నారు. సమాజంలోని పరిస్థితులు, రాజకీయాల పట్ల పూర్తిస్థాయి అవగాహన కలిగిన యువత తమ ఓటు ఎటు వేస్తారో తెలియని పరిస్తితులు నెలకొన్నాయి.

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు రెండు లక్షల యాబై వేలకు పైనే వరకు ఉన్నారు. ఇందులో 18 నుండి 40 సంవత్సరాల లోపు లక్ష యాబై వేల వరకు ఉన్నారు. 40 నుంచి 49 వయసు కలిగిన వారు 50 వేల వరకు ఉన్నారు. తాజా ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకున్న 18 సంవత్సరాలు నిండిన యువత 10 వేల వరకు ఉన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story