ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం : ఎమ్మెల్యే గాంధీ

by Disha Web Desk 15 |
ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం : ఎమ్మెల్యే గాంధీ
X

దిశ, మియాపూర్ : ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కి చెందిన కె.వినయ్ కుమార్ అనే బీఆర్ ఎస్ కార్యకర్త గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందిన కార్యకర్త కావడంతో వెంటనే స్పందించి ఆయనకు సంబంధించిన ఎఫ్ ఐ ఆర్ కాపీలు, పోస్టుమార్టం రిపోర్టులను భారత రాష్ట్ర సమితి పార్టీ ఇన్సూరెన్స్ విభాగానికి పంపడం జరిగింది.

అనంతరం మంజూరైన రూ. 2 లక్షల ప్రమాద బీమా చెక్కును బాధిత కుటుంబానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే గాంధీ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కే సీ ఆర్ బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ఆపద లో ఉన్నపుడు ఆదుకోవాలని వారి కుటుంబాలకు కొండంత అండగా నిలవాలనే ఉద్దేశంతో కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేష్, శివ పాల్గొన్నారు.

Next Story

Most Viewed