బాలు గళం అక్షయపాత్ర : వెంకయ్య నాయుడు

by Muthe.Rajitha |

ప్రసిద్ధ తెలుగు సినీ గాయకుడు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ నేడు రవీంద్ర భారతిలో జరిగింది.

బాలు గళం అక్షయపాత్ర : వెంకయ్య నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రసిద్ధ తెలుగు సినీ గాయకుడు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ నేడు రవీంద్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో బాలు చెల్లెలు శైలజా, ఆమె భర్త శుభలేఖ సుధాకర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. దేవుడు స్వార్థపరుడని ఆవేదన వ్యక్తం చేసారు. ముందు ఘంటసాలను, ఆ తర్వాత బాలసుబ్రమణ్యంను తీసుకెళ్లారని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం స్వరసార్వభౌమత్వానికి నిదర్శనమని కొనియాడారు. బాలు గళం సంగీత దర్శకుడు కోరుకున్నది ఇచ్చే అక్షయపాత్రలాంటిదని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. అలాంటి గాన గంధర్వుడు మన మధ్య లేకపోవడం విచారకరం అని విచారం వ్యక్తం చేసారు.

Next Story