రక్తమోడిన కూకట్ పల్లి మెయిన్ రోడ్డు.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

by Web Desk |
రక్తమోడిన కూకట్ పల్లి మెయిన్ రోడ్డు.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
X

దిశ, శేరిలింగంపల్లి: వరుస యాక్సిడెంట్లతో శేరిలింగంపల్లి, కూకట్ పల్లి రహదారి రక్తమోడింది. ఉదయం 9గంటల సమయంలో వివేకానంద నగర్ ఉషాముల్లాపూడి కమాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చందానగర్ నుండి గాజులరామరం వైపు స్కూటీపై వెళుతున్న మధుసూదన్ (62)ను వెనక నుండి వచ్చిన హెచ్.పి గ్యాస్ లారీ ( టీఎస్ 08యూజే 0188) బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మధుసూదన్ అక్కడికక్కడే మృతి చెందారు. లారీని రోడ్డు మీదే వదిలేసి డ్రైవర్ పరారవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

రెండో ప్రమాదం..

హైదర్ నగర్ డివిజన్ మెట్రో పిల్లర్ 659 ఏ వాటర్ ట్యాంకర్స్ అడ్డా సమీపంలో డీసీఎం బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన డీసీఎం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో యమహా బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ యువకుడి పరిస్థితి సీరియస్‌‌గా ఉండగా కేపీహెచ్ బీలోని ఇద్దరిని రెమిడీ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed