ట్యాంక్​బండ్ ​పరిసరాల్లో ట్రాఫిక్​ఆంక్షలు

by Dishanational2 |
ట్యాంక్​బండ్ ​పరిసరాల్లో ట్రాఫిక్​ఆంక్షలు
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో : బీఆర్ అంబేద్కర్ జయంతి.. మహా విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసరాల్లో నెక్లెస్​రోడ్డు, ఐమాక్స్​థియేటర్​ఏరియాల్లో ట్రాఫిక్​ఆంక్షలు ఉంటాయని సిటీ ట్రాఫిక్​అడిషనల్ కమిషనర్​సుధీర్​బాబు తెలిపారు. అంబేద్కర్​భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నేపథ్యంలో నిర్వహిస్తుండగా భారీగా జనాలు తరలిరానున్నారు. ఐమాక్స్ లో శాకుంతలం సినిమా ప్రీమియర్​షోను కూడా రద్దు చేసినట్టు థియేటర్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం, సాయంత్రం షోలు కూడా ఉండవని.. రాత్రి10గంటల షో మాత్రం ఉంటుందని పేర్కొన్నాయి. ప్రీమియర్, మ్యాట్నీ, ఈవెనింగ్​షో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు వాపసు చేయనున్నట్టు తెలిపాయి.

ట్రాఫిక్​ఆంక్షలు ఇలా..

విశ్వేశ్వరయ్య విగ్రహం - నెక్లెస్​రోటరీ, ఎన్టీఆర్​మార్గం, తెలుగుతల్లి జంక్షన్​వద్ద ఇరువైపులా ట్రాఫిక్​ను అనుమతించరు.

ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్​రోటరీ వైపు వచ్చే వెహికల్స్ ను విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి షాదన్​కాలేజీ, నిరంకారీ భవన్​వైపు..

ట్యాంక్​బండ్​నుంచి పీవీఎన్ఆర్​మార్గం వైపు వచ్చే వాహనాలను సొనాబీ మసీదు నుంచి రాణిగంజ్, కర్బలా మైదాన్​వైపు..

రసూల్​పురా, మినిస్టర్​రోడ్డు నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్​రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్​నుంచి రాణిగంజ్​వైపు..

ఇక్బాల్ మినార్​ నుంచి జంక్షన్​మీదుగా ట్యాంక్​బండ్, రాణిగంజ్, లిబర్టీ వైపు వాహనాలు వెళ్లటానికి అనుమతించరు. వీటిని తెలుగుతల్లి ఫ్లై ఓవర్​బ్రిడ్జి మీదుగా కట్టమైసమ్మ ఆలయం, లోయర్​ట్యాంక్​బండ్​వైపు మళ్లిస్తారు.

ట్యాంక్​బండ్, తెలుగుతల్లి వైపు నుంచి ఎన్టీఆర్​మార్గం వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్​నుంచి ఇక్బాల్​మినార్ జంక్షన్​వైపు..

బీఆర్కేఆర్​భవన్​నుంచి ఎన్టీఆర్​మార్గం వైపు వాహనాలను అనుమతించరు. తెలుగుతల్లి జంక్షన్​నుంచి ఇక్బాల్​మినార్​జంక్షన్​వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్​బడా గణేశ్​ నుంచి ప్రింటింగ్​ప్రెస్​జంక్షన్, నెక్లెస్​రోటరీ వైపు అనుమతించరు. వీటిని రాజ్​దూత్​లైన్​లోకి మళ్లిస్తారు. ఎన్టీఆర్​గార్డెన్, ఎన్టీఆర్​ఘాట్, నెక్లెస్​రోడ్డు, లుంబినీ పార్కు మూసివేసి ఉంటాయి.

ఆర్టీసీ బస్సులు..

అఫ్జల్​గంజ్​నుంచి సికింద్రాబాద్​వైపు వచ్చే బస్సులు తెలుగుతల్లి ఫ్లైఓవర్​బ్రిడ్జి మీదుగా లోయర్​ట్యాంక్​బండ్, డీబీఆర్​మిల్స్, కవాడిగూడ మీదుగా వెళ్లాలి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విధించిన ట్రాఫిక్ ఆంక్షలకు వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్​అడిషనల్ కమిషనర్ కోరారు.



Next Story

Most Viewed