దారి దోపిడీకి యత్నించిన ముగ్గురు యువకులు

by Naveena |   (  Updated:2025-03-25 08:05:16  IST  )

కత్తులతో బెదిరించి దారి దోపిడీకి యత్నంచిన ముగ్గురు వ్యక్తులను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దారి దోపిడీకి యత్నించిన ముగ్గురు యువకులు
X

దిశ, శేరిలింగంపల్లి : కత్తులతో బెదిరించి దారి దోపిడీకి యత్నంచిన ముగ్గురు వ్యక్తులను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి మాదాపూర్ మైండ్ పేస్ వద్ద ముగ్గురు దుండగులు.. దారివెంట వెళ్తున్న బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ప్రయాణీకులు వారిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి.. నిందితులను అప్పగించారు. దీంతో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి.. మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story