రైతుల ఖాతాలో రూ.7490 కోట్లు జమ : మంత్రి తుమ్మల

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ప్రభుత్వం ఆరు నుంచి 7 ఎకరాల సాగుభూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు సోమవారం విడుదల చేసింది...

రైతుల ఖాతాలో రూ.7490 కోట్లు జమ : మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఆరు నుంచి 7 ఎకరాల సాగుభూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు సోమవారం విడుదల చేసింది. ఆరు రోజుల్లో 68.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,490.72 కోట్లు జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రికార్డు స్థాయిలో భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 68.37 లక్షల మంది రైతులకు సంబందించిన 124.85 లక్షల ఎకరాల భూమికి భరోసా పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

Next Story