ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : ఎంపీ, ఎమ్మెల్యే

by Disha Web Desk 15 |
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : ఎంపీ, ఎమ్మెల్యే
X

దిశ, శేరిలింగంపల్లి : ప్రజా సమస్యలను తీర్చడమే లక్ష్యంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ అన్నారు. గురువారం కూకట్ పల్లి డివిజన్ (పార్ట్) పరిధిలో గల పాపిరెడ్డి నగర్ , ఆస్బెస్టాస్ కాలనీలలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి, చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి పాదయాత్ర చేశారు. ఆరెకపూడి గాంధీ ఈ సందర్బంగా మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, దశల వారీగా అభివృద్ధి పనులు చేపడతామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.

ఆయా కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకొని, వారి విజ్ఞప్తి మేరకు కాలనీలలో స్వయంగా ఇంటింటికీ తిరుగుతూ పరిష్కరించేలా కృషి చేస్తున్నామని అన్నారు. డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు, విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీల వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed