ఎన్యూమరేషన్ దరఖాస్తుల పంపిణీ పూర్తి చేయాలి

by Taduka Kalyani |

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ లో వంద శాతం కవరేజీ సాధించాలని జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ఆదేశించారు.

ఎన్యూమరేషన్ దరఖాస్తుల పంపిణీ పూర్తి చేయాలి
X

దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ లో వంద శాతం కవరేజీ సాధించాలని జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నాటికి ఓటర్లకు 60% ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. పంపిణీ ప్రక్రియ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోంది. మిగిలిన ఫారమ్‌ల పంపిణీని వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా 100% కవరేజీ సాధించాలని బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లు బి ఎల్ ఓ లకు పూర్తిగా సహకరించి, సక్రమంగా నింపిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లను అవసరమైన పత్రాలతో కలిపి నిర్దేశిత గడువులోగా సమర్పించాలన్నారు.

Next Story