Hyd: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. కూకట్‌పల్లి కార్యకర్తల ఆందోళన

by Disha Web Desk 16 |
Hyd: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. కూకట్‌పల్లి కార్యకర్తల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ పార్టీ కూకట్‌పల్లి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కూకట్ పల్లి సీటును జనసేనకు కేటాయించొద్దని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో బీజేపీ నేతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంకా సీట్లు ఖరారు కాలేదని, ఎవరూ ఆవేశపడొద్దని చెబుతున్నారు. అయినా కార్యకర్తలు మాత్రం ఆ సీటును బీజేపీకి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. జనసేనకు ఇస్తే తాము ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు.

కాగా తెలంగాణలో బీజేపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. కానీ అధికారికంగా మాత్రం పొత్తు ఖరారు కాలేదు. అయితే కొన్ని స్థానాల్లో మాత్రం సీట్ల లొల్లి ప్రారంభమైంది. ప్రముఖంగా కూకట్‌పల్లి వంటి స్థానంలో ఈ లొల్లి మరింత ముదిరింది. కూకట్ పల్లి సీటును జనసేకు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానిక బీజేపీ కార్యర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూకట్ పల్లిలో బీజేపీ ఉందంటే తమ వల్లేనని అంటున్నారు. అలాంటిది పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటున్నారు. అవసరమైతే బీజేపీకి గుడ్ బై చెప్పి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని హెచ్చరిస్తున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Next Story

Most Viewed