- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పెహల్గామ్ ఘటనకు ప్రతీకార చర్య తీసుకోవాలి: మాజీ మంత్రి తలసాని

దిశ, బేగంపేట : పెహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిని మాజీ మంత్రి, సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పై భారత ప్రభుత్వం వెనువెంటనే ప్రతీకార చర్య చేపట్టాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. పెహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా శుక్రవారం రాత్రి సికింద్రాబాద్ పేజీ రోడ్డు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం నుండి వెస్లీ హనుమాన్ దేవాలయం వరకు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జిలను పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటనలో 28 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల మూలంగానే భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు పలకాలని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం జమ్మూ కాశ్మీర్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తుదమొట్టించాలని అన్నారు. భారత్ వైపు చూడాలంటే భయపడేలా పాకిస్తాన్ పై ప్రతీకార చర్య తీసుకోవాలని కోరారు.బేగంపేట కార్పొరేటర్ టి. మహేశ్వరి మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీహరి, నరేందర్, కిషోర్, శ్రీనివాస్ గౌడ్, ఆరిఫ్, శేఖర్, పీజీ రోడ్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రవీణ్, సంజయ్ తదితరులు ఉన్నారు.