- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అహింసా సందేశంతో స్ట్రే డాగ్ అడాప్షన్
నగరంలోని కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డాగ్ అడాప్షన్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీ రేణుక చౌదరి హాజరయ్యారు.

దిశ, ఖైరతాబాద్ : నగరంలోని కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డాగ్ అడాప్షన్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీ రేణుక చౌదరి హాజరయ్యారు. కొండా సురేఖ చేతుల మీదుగా స్వదేశీ కుక్కపిల్లను మంత్రి సీతక్క అడాప్ట్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఎంపీ రేణుక చౌదరి.. మంత్రి సీతక్క చేతుల మీదుగా కుక్క పిల్లను ఆడాప్ట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ యజమానులు చనిపోతే ఆవేదనతో మృతి చెందిన కుక్కలు ఉన్నాయని శునకాలపై అనవసరంగా దాడి చేస్తేనే అవి తిరిగి దాడికి పాల్పడతాయని అన్నారు. తన ఇంటి చుట్టూ నిత్యం పదికి పైగా కుక్కలు సంచరిస్తున్న తాను ఎప్పుడూ వాటిని తొలగించాలని ఫిర్యాదు చేయలేదని అన్నారు. కేవలం స్టెరిలైజ్ చేసి వదిలేయాలని సూచించినట్లు తెలిపారు. ఎంతో విశ్వాసంతో మెలిగే శునకం యజమానికి రక్షణగా నిలుస్తుందని అన్నారు. ఇంట్లో కుక్క ఉంటే మనిషితో సమానమని అన్నారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కుక్క పిల్లలను దత్తత తీసుకొని ఆదర్శంగా నిలవాలని సూచించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ నగర నడిబొడ్డున జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. స్ట్రే డాగ్స్ను దత్తత తీసుకోవడం ద్వారా వాటికి జీవించే హక్కును కల్పించడమే కాకుండా సమాజంలో మానవత్వాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు. ప్రతి ప్రాణికీ జీవించే హక్కు ఉందని, విశ్వాసానికి మారుపేరు కుక్క అని ఆమె అన్నారు. ఇంట్లో ఒక డాగ్ ఉంటే భద్రతా భావం కలుగుతుందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అహింసా సిద్ధాంతాన్నే అనుసరించిందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మాజీ కార్పొరేటర్ విజయా రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పాల్గొన్నారు.






