ఎంఎంటీస్ ప్రయాణికులకు శుభవార్త

by Dishafeatures2 |
ఎంఎంటీస్ ప్రయాణికులకు శుభవార్త
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాల్లోని ప్రయాణికుల సౌకర్యార్థం 40 ఎంఎంటీఎస్ సర్వీసులను అదనంగా అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు, వాటి గమ్యస్థానాన్ని కూడా పొడిగించింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్లేందుకు 20, ఫలక్‌నామ నుంచి ఉందానగర్ వరకు మరో 20 ఎంఎంటీఎస్ రైళ్లను అదనంగా కేటాయించింది. అలాగే లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నూమా వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లను ఉందానగర్ వరకు పొడిగించింది. దీంతో జంటనగరాలలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య 106కు చేరింది.


Next Story

Most Viewed