- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.50 కోట్లు విడుదల
రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్టర్ల బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసినట్లు తెలంగాణ ఖనిజా వృద్ది సంస్ధ ఎండీ వైస్చైర్మన్, ఎండీ అనుదీప్దురిశెట్టి పేర్కొన్నారు...

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్టర్ల బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసినట్లు తెలంగాణ ఖనిజా వృద్ది సంస్ధ ఎండీ వైస్చైర్మన్, ఎండీ అనుదీప్దురిశెట్టి పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఇసుక ర్యాండమైజేషన్బుకింగ్లు ఉదయం 9 గంటలతో పాటు సాయంత్రం 4 గంటలకు అమలు చేయనున్నట్లు, దీంతో మరింత పారదర్శకత, సమాన బుకింగ్ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కార్పొరేషన్రోజుకు 1.10 లక్షల మెట్రిక్టన్నులు ఇసుక అందుబాటులో ఉంచుతుందని అందులో 0.63 మెట్రిక్టన్నులు బుక్అవుతుండగా, 0.46 మెట్రిక్ టన్నులు బుక్కాకుండా మిగులుతుందన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత అనేది ఎక్కడ లేదని కొందరు కావాలని సంస్దపై తప్పడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇసుక 24 గంటలు అందుబాటులో ఉంటుందని, అవుట్ఆప్స్టాక్అని చూపిస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. టీజీఎండీసీ వద్ద విక్రయానికి 1.15 కోట్ల మెట్రిక్టన్నుల ఇసుక తవ్వేందుకు సిద్దంగా ఉందని, ఇసుక బుకింగ్వ్యవస్ధ పూర్తిగా డిజిటల్, స్వయం చాలక వేదిక ద్వారా నిర్వహిస్తోందన్నారు. అన్ని బుకింగ్లు ముందు నిర్దేశించిన సిస్టమ్ప్రోటోకాల్స్ ఆదారంగా సాండ్సేల్మేనేజ్మెంట్ అండ్మానిటరింగ్సిస్టమ్ద్వారా ప్రాసెస్చేయబడుతుందని వెల్లడించారు. ఆర్డర్ల కేటాయింపులో మానవుల జోక్యం ఉండదని, బుకింగ్ వ్యవస్ధను పారదర్శకత, నిష్పకపాతత్వం, వినియోగదారులందరికి సమాన అవకాశాలు కల్పించే విధంగా రూపొందించ బడిందన్నారు.
మౌలిక వసతుల ప్రాజెక్టులు, పరిశ్రమలు, సంస్ధలు ఇతర పెద్ద వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు బల్క్బుకింగ్సౌకర్యం ప్రవేశపెట్టామన్నారు. అర్హత ప్రమాణాలు, బుకింగ్ పరిమితులు, చెల్లింపు, కేటాయింపు విధానాలు అన్ని దరఖాస్తులకు సమానంగా వర్తిస్తాయని ఎటువంటి వివక్ష ఉండదన్నారు. బల్క్బుకింగ్ఆమోదం పొందిన తరువాత కొంతమంది వినియోగదారులు ఒక రీచ్నుంచి మరో రీచ్కు ఆర్డర్బదిలీ చేయాలని కోరితే రుసుము, జరిమానాలు పైలట్ప్రాతిపదికన విధించబడుతుందని చెప్పారు. ఈనెల 17వ తేదీ నుంచి ఇప్పటివరకు 83 ఆర్డర్లపై రూ.2.83 లక్షల వసూలు చేసినట్లు వివరించారు. ఈకార్యక్రమంలో అధికారులు ఎల్లయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






