ఓయూలో దీక్ష చేపట్టిన రిటైర్డ్ ప్రొఫెసర్ అన్సారీ..

by Disha Web Desk 20 |
ఓయూలో దీక్ష చేపట్టిన రిటైర్డ్ ప్రొఫెసర్ అన్సారీ..
X

దిశ, సికింద్రాబాద్ : ఉస్మానియా యూనివర్సిటి లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్డ్ అయిన ప్రొఫెసర్ అన్సారీ ఆర్ట్స్ కాలేజీలో సోమవారం దీక్షకు బైఠాయించారు. తాను రిటైర్మెంట్ అయి 5 నెలలు గడుస్తున్నా నో డిమాండ్ డ్యూస్ (ఎన్డీడీ) సర్టిఫికేట్ ఇవ్వడం లేదనే ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఒత్తిడి చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ఒక మైనారిటీ ప్రొఫెసర్ అయిన తన మీద ఓయూ వీసీ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే త్వరలోనే తన కుటుంబంతో ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.



Next Story

Most Viewed