ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధునీకరణకు రహెజా గ్రూప్ తోడ్పాటు..

by Disha Web Desk 20 |
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధునీకరణకు రహెజా గ్రూప్ తోడ్పాటు..
X

దిశ, మియాపూర్ : ఆరోగ్య చేవెళ్ల దిశగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్. జి.రంజిత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరించి, పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ తలపించారు. అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సివిల్ వర్క్స్, శానిటరీ అరేంజ్మెంట్స్, తాగు నీరు, ఎలక్ట్రిసిటీ మొదలగు మౌలిక సదుపాయాల కొసం నిధులు సమకూర్చాలని రహేజా గ్రూప్ సీఈఓ శ్రావణ్ ను సంప్రదిస్తూ లేఖ రాశారు.

అందుకు స్పందించిన రహేజా గ్రూప్, వారి సీఎస్ఆర్ నిధుల నుంచి 45 లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఈ నిధులతో శేరిలింగంపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునికరించి, పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే అరికేపూడీ గాంధీ సహకరిస్తున్నారని ఆయన వెల్లడించారు.



Next Story

Most Viewed