- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేశారు.. ప్రొ. హరగోపాల్ ఆగ్రహం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నేతలు భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని పీపుల్స్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాల విభజన పేరుతో ముక్కలు చేసి విశిష్టత లేకుండా ఉన్నా అస్థిత్వాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. సంపద ఉన్నోళ్ల చుట్టే రాజకీయ నాయకులు తిరుగుతున్నారని, ప్రజాస్వామ్య సంస్కృతి పోయిందని, దాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పాటలను కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పేరు పై గెలిచి, తెలంగాణను మరిచిపోయేలా చేశారని చెప్పారు. తెలంగాణ పేరుతో ఉద్యమాలు చేసి.. భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. అసలు తెలంగాణ ఎక్కడికి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలు వస్తేనే బీఆర్ఎస్ నేతలకు, మంత్రులకు తెలంగాణ గుర్తుకు వస్తుందా..? అని హర గోపాల్ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ యూనివర్శిటీలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీలను పట్టించుకోవడమే మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గవర్నమెంట్ పాఠశాలలను పాడు చేశారని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనపై పౌర సమాజం చైతన్యంగా ఆలోచించాలని హరగోపాల్ పిలుపు నిచ్చారు.