సికింద్రాబాద్ ప్రమాదంపై DCP చందనా దీప్తి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
సికింద్రాబాద్ ప్రమాదంపై DCP చందనా దీప్తి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ అగ్నిపమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎలక్ట్రిక్ బైకు షోరూం నిర్వాహకుడు రంజిత్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశారు. తాజాగా.. ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తోన్న నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... నిబంధనలకు విరుద్ధంగా రంజిత్ షోరూం నిర్వహిస్తున్నాడని అన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ అప్పటికే మంటల్లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను కాపాడినట్లు తెలిపారు. ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Next Story