మాతృ శ్రీ నగర్ లో 5కె రన్.. పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ

by Disha Web Desk 11 |
మాతృ శ్రీ నగర్ లో 5కె రన్.. పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ
X

దిశ, శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృ శ్రీ నగర్ కాలనీలో మాతృ శ్రీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె రన్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాతృ శ్రీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 5కె రన్ నిర్వహించడం అభినందనీయమని, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ ఎంతో అవసరం అని గుర్తు చేశారు.

ఈ రన్ లో వయసుకు అతీతంగా వృద్ధులు, యువత, చిన్న పిల్లలు పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలని, శారీరక శ్రమ వలన మానసికోల్లాసం, ప్రశాంతత వస్తుందని, మారిన జీవన శైలిలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాయమం చేయాలని, ఈ రన్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాతృ శ్రీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ కావూరి, సెక్రటరీ నాగరాజు, కన్నయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed