శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయంలో భారీ ఎత్తున అధికారుల బదిలీ

by Disha Web Desk 6 |
శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయంలో భారీ ఎత్తున అధికారుల బదిలీ
X

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయంలో భారీ ఎత్తున అధికారుల బదిలీ జరిగింది. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ బదిలీ కాగా తాజాగా ఆర్ ఐ లు ఇతర కిందిస్థాయి సిబ్బంది కూడా బదిలీ అయ్యారు. మండలం నుంచి ఒకేసారి ఆరుగురు అధికారులు బదిలీ అయ్యారు. ఇక్కడ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్ మేడ్చల్ కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు. రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు కే.శీనయ్య గండిపేట మండల సీనియర్ అసిస్టెంట్ గా, ఆకారపు శ్రీకాంత్ మొయినాబాద్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా బదిలీ అయ్యారు.

వీరితో పాటు జూనియర్ అసిస్టెంట్లు నరేందర్ రెడ్డి మహేశ్వరం మండలానికి, రామకృష్ణ అబ్దుల్లాపూర్ మెట్ మండలానికి, శ్రీలత హయత్ నగర్ మండలానికి బదిలీ అయ్యారు. రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు శీనయ్య స్థానంలో కందుకూరు మండలం నుంచి ఏ.శ్రీను, శ్రీకాంత్ స్థానంలో జి.చంద్రమోహన్ మొయినాబాద్ మండలం నుంచి బదిలీపై రానున్నారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ నరెందర్ రెడ్డి స్థానంలో నరేష్ మహేశ్వరం మండలం నుంచి బదిలీపై రానున్నారు. సూపరింటెండెంట్ శంకర్ స్థానంలో ఇంకా ఎవరిని కేటాయించలేదు. సీనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి స్థానంలో ఫ్రాంక్లిన్ కొద్ది రోజుల క్రితమే చార్జ్ తీసుకున్నారు. శేరిలింగంపల్లి మండల రెవెన్యూ లో ఒకేసారి పాత అధికారులంతా బదిలీ అవ్వడం, ప్రస్తుతం అంతా కొత్తవారే కావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు.




Next Story

Most Viewed