- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పార్కులో వాకింగ్కు వచ్చిన వ్యక్తి... కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి
దిశ, సికింద్రాబాద్: సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్ పార్కులో శుక్రవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వాకింగ్ చేయడానికి వచ్చిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పార్శిగుట్ట బాబూజీ నగర్ చెందిన ప్రదీప్(43) రోజు ఉదయం వాకింగ్ కోసం పార్క్ కు వస్తుంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం వాకింగ్ చేస్తున్న క్రమంలో హై టెన్షన్ తీగలు తెగి ట్రాక్ మీద పడిపోయాయి. వాకింగ్ చేస్తున్న ప్రదీప్ కాలికి విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని గతంలో కూడా ఇలా చాలా సార్లు తీగలు తెగిపడినా పట్టించుకోలేదని పలువురు మండిపడుతున్నారు. విద్యుత్ అధికారులే తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పార్కు వద్ద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు బీజేపీ నాయకులు వారికి మద్దతు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.