ధర్నా చౌక్‌లో ప్రారంభమైన జర్నలిస్టుల ‘‘మహాధర్నా’’

by Disha Web Desk 19 |
ధర్నా చౌక్‌లో ప్రారంభమైన జర్నలిస్టుల ‘‘మహాధర్నా’’
X

దిశ, ముషీరాబాద్: అర్హత ఉన్న జర్నలిస్టులు అందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, హైద్రాబాద్‌లోని హౌసింగు సొసైటీలకు వారి ఆధీనంలో ఉన్న భూములను వారికే ఇవ్వాలని, ఏ సొసైటీలో మెంబర్షిప్ లేని జర్నలిస్టులకు ప్రత్యేక విధానం ద్వారా స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా ప్రారంభమైంది.

ఈ ధర్నాలో జిల్లా కేంద్రాలు, నియోజక వర్గాలు, మండల స్థాయి జర్నలిస్టులకూ హౌజ్ సైట్స్ ఇవ్వాలని, జర్నలిస్టుల సమస్యలను సర్కారు సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాకు మద్దతుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తదితరులు హాజరుకానున్నట్లు టీడబ్ల్యూజేఎఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్యలు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed