జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా కొప్పుల నర్సింహా రెడ్డి

by Disha Web Desk 11 |
జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా కొప్పుల నర్సింహా రెడ్డి
X

దిశ, ఎల్బీనగర్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం కొప్పుల నర్సింహారెడ్డిని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమిస్తూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

తనపై నమ్మకంతో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమించిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ కు, పార్టీ నాయకులకు కొప్పుల నర్సింహా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన వంతు బాధ్యతగా ప్రజా సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో పోరాడుతానని కొప్పుల వెల్లడించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story