హైదరాబాద్‌లో పాకిస్థానీయులు గుర్తింపు.. ఎంతమందంటే..?

by Kavya |
హైదరాబాద్‌లో పాకిస్థానీయులు గుర్తింపు.. ఎంతమందంటే..?
X

దిశ, సిటీక్రైం : పహల్గామ్‌ సంఘటన తర్వాత భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య నెలకున్న ఉద్రిక్తల నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏప్రీల్ 27 వ తేది వరకు దేశంలో ఉండే పాకిస్తాన్ దేశస్థులు తిరిగి తమ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో దాదాపు 208 పాకిస్తాన్ కు చెందిన దేశస్థులు ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. వీరందరీ పై నిఘా ఉండడం చట్టబద్ధంగా వీసాలతో రావడం , వారి వివరాలతో పాటు వారందరూ పోలీసులకు అందుబాటులోనే ఉన్నారు. ఈ 208 మందిలో 156 మందికి లాంగ్ టర్మ్ వీసాల అనుమతి ఉంది, 13 మందికి షార్ట్ టర్మ్ వీసాల పర్మిషన్ ఉంది, మరో 39 మందికి మెడికల్, బిజినెస్, ఇతర అంశాల మీద వీసాలు పొంది వచ్చిన వారుగా నమోదయ్యారు.

వీరందరీకి హైదరాబాద్ పోలీసులు నోటీసులను అందించారు. కేంద్రం ఆదేశాల ప్రకారం షార్ట్ టర్మ్ , ఇతర వ్యవహారాల్లో వీసాలు పొందిన వారందరూ ఈ నెల 27 వ తేదిలోపు పాకిస్తాన్ కు వెళ్ళిపోవాలన్నారు. మెడికల్ వీసాలు ఉన్న వారు ఈ నెల 29 వ తేది లోపు వెళ్ళిపోవాలని పోలీసులు నోటీసులలో పేర్కొన్నారు. లాంగ్ టర్మ్ వీసాలకు సంబంధించిన వారికి ఇంకా ఏలాంటి స్పష్టమైన ఆదేశాలను కేంద్రం ఇవ్వకపోవడంతో వారికి ఈ అంక్షలు వర్తించవని పోలీసులు తెలిపారు. వారి పూర్వీకులు ఇండియాకు చెందిన వారు ఉండడం, మన దేశస్థులను వివాహాం చేసుకుని ఇక్కడే ఉంటున్న వారందరూ ఈ లాంగ్ టర్మ్ వీసాలను పొంది ఉన్నారని సమాచారం. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పాకిస్తాన్ కు చెందిన ముగ్గురు ఉంటున్నట్లు గుర్తించి వారికి నోటీసులు అందించినట్లు అధికారులు తెలిపారు.




Next Story