ఆర్య‌వైశ్యుల‌కు గుడ్ న్యూస్.. వాస‌వి మాత జ‌యంతి కి అధికారిక గుర్తింపు

by Ratna Kumari |   (  Updated:2026-04-23 13:29:18  IST  )

ఆర్య‌వైశ్యుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాస‌వి మాత జ‌యంతిని అధికారిక పండుగా ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఆర్య‌వైశ్యుల‌కు గుడ్ న్యూస్..  వాస‌వి మాత జ‌యంతి కి  అధికారిక గుర్తింపు
X

దిశ‌, వ‌న‌స్థ‌లిపురం : ఆర్య‌వైశ్యుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాస‌వి మాత జ‌యంతిని అధికారిక పండుగా ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం పై ఆర్య‌వైశ్య స‌మాజం హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది. ప్ర‌తి సంవ‌త్స‌రం వాస‌వి మాత జ‌యంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లోని ఆర్య‌వైశ్యుల త‌ర‌పున సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్త కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆర్య‌వైశ్యుల ఆత్మ‌గౌర‌వాన్ని మ‌రింత పెంపొందించేదిగా ఉంద‌ని.. స‌మాజంలో ఐక్య‌త‌ను పెంపొందిస్తుంద‌ని పేర్కొన్నారు.

Next Story