Congress: ఓబీసీ డిక్లరేషన్ చైర్మన్‌గా Ponnam Prabhakar

by Disha Web Desk 16 |
Congress: ఓబీసీ డిక్లరేషన్ చైర్మన్‌గా Ponnam Prabhakar
X
  • ఆరుగురు కో –చైర్మన్లు
  • 9 మంది అడ్వైజరీ కమిటీ
  • 37 మందితో టీమ్

దిశ, తెలంగాణ బ్యూరో: ఓబీసీ డిక్లరేషన్ చైర్మన్‌గా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు ఆరుగురు కో చైర్మన్లను , 9 మంది అడ్వైజరీ కమిటీ, మరో 37 మందితో టీమ్​‌ను ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 50 శాతం బీసీ వర్గాలను కాంగ్రెస్ వైపు తిప్పుకునేలా డిక్లరేషన్ ఉంటుందన్నారు. బలహీన వర్గాలకు మేలు జరిగేలా అంశాలను రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. పబ్లిక్​‌తో పాటు వివిధ రంగాల్లోని నిపుణుల సలహాలు, సూచనలు తీసుకొని డిక్లరేషన్ అంశాలపై అధ్యయనం జరుగుతుందన్నారు. త్వరలో బీసీ డిక్లరేషన్ సభపై తేదీని ఫిక్స్ చేయనున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Next Story