ప్రతి కార్యకర్త చురుకుగా పని చేయాలి : ఎమ్మెల్యే ముఠా గోపాల్

by Disha Web Desk 15 |
ప్రతి కార్యకర్త చురుకుగా పని చేయాలి : ఎమ్మెల్యే ముఠా గోపాల్
X

దిశ, ముషీరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క బీఅర్ఎస్ కార్యకర్త చురుకుగా పని చేయాలి అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం రాత్రి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ప్రజలతో ఆత్మీయ సమ్మేళనలు, సమావేశాలు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజవర్గంలోని అన్ని డివిజన్లల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై ఉండాలని కోరారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రులు పార్టీ ఇన్చార్జులుగా హాజరవుతారని, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జై సింహ, పలు డివిజన్ల అధ్యక్షులు వలాల శ్యామ్ యాదవ్, నర్సింగ్ ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ లు శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్, సురేందర్, దామోదర్ రెడ్డి, సాయి, శ్రీకాంత్, మాధవి, వల్లాల శ్రీనివాస్ యాదవ్, రాంచందర్, జయ దేవ్, శ్రీధర్ చారి, అనిల్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed