- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాధారణ వ్యక్తిలా జనాల మధ్యలోకి వచ్చిన సీఎం రేవంత్..
హుస్సేన్ సాగర్ తీరాన నిమజ్జనంలో పాల్గొంటున్న భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. పరిమిత వాహనాలతో

దిశ, ఖైరతాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన నిమజ్జనంలో పాల్గొంటున్న భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్న ఆయన, ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండానే సామాన్యుల మధ్య నిలబడి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఖైరతాబాద్ గణపతి నిమర్జనం అయిన క్రేన్ నెంబర్4 వద్ద కు వెళ్ళి పరిశీలించారు.
నిమర్జనం ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, శుభ్రత, ప్రజల రాకపోకలపై ఆయన సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద భాగ్యనగర్ ఉత్సవ మండపం ఎక్కిన సీఎం రేవంత్..మండపంపై నుంచి గణపతి పబ్బా మోరియా అంటూ స్లోగన్ ఇచ్చారు..సీఎం స్వయంగా హఠాత్తుగా పరిశీలనకు రావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయనను చూసిన ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు.






