శోభాయాత్రను అడ్డుకోవద్దు

by velandi.Saikiran |

అంబర్ పేట్ నియోజకవర్గంలో నిమజ్జనం సందర్భంగా గ‌ణ‌ప‌తుల నిర్వ‌హకులు త్వరగా వెళ్లిపోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని

శోభాయాత్రను అడ్డుకోవద్దు
X

దిశ, అంబర్ పేట : అంబర్ పేట్ నియోజకవర్గంలో నిమజ్జనం సందర్భంగా గ‌ణ‌ప‌తుల నిర్వ‌హకులు త్వరగా వెళ్లిపోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గణనాధునికి 11 రోజులు పూజలు చేసి శాంతియుతంగా భక్తులు నిమజ్జనానికి శోభాయాత్రగా వెళుతుంటే పోలీసులు దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని శోభయాత్ర తీస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిప‌డ్డారు. పోలీసులు కూడా భక్తులకు కోఆపరేట్ చేయాలని ఆయన సూచించారు.

Next Story