బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరడమేంటి.. అది ఫేక్ న్యూస్

by Web Desk |
బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరడమేంటి.. అది ఫేక్ న్యూస్
X

దిశ, మియాపూర్: మియాపూర్ డివిజన్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్‌కు చెందిన కొంతమంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్‌ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని, అలాంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు యోగానంద్ అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే బీజేపీ కార్యకర్తలుగా చెప్పి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారని ఎద్దేవా చేశారు. అసలు వాళ్లు ఎవరో కూడా తమకు తెలియదని, వారికి మా పార్టీ సభ్యత్వం కూడా లేదని వివరించారు. ప్రస్తుతం జనాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, బీజేపీకి మద్దతు పెరుగుతుండటంతో ఓర్వలేక, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా తప్పుడు ప్రచారాలు చేయడం మనుకోవాలని, లేకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు మణిక్ రావు, విజేందర్, సిద్దు, వెంకట్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed