AP BRS: ఏపీ బీఆర్ఎస్‌లోకి పెరుగుతున్న చేరికలు

by Disha Web Desk 16 |
AP BRS: ఏపీ బీఆర్ఎస్‌లోకి  పెరుగుతున్న చేరికలు
X
  • నమ్మిన ప్రజలను నట్టేట ముంచిన జగన్
  • బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
  • హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో చేరికలు

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏపీలో కీలకపాత్ర పోషించనుందని ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. అమలు సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన సీఎం జగన్ నమ్మిన ప్రజానీకాన్ని నట్టేట ముంచారని విమర్శించారు.

సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో తోట మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన అవినీతికి పరాకాష్టగా మారిందన్నారు. రాష్ట్రంలో ఇసుక, గంజాయి మాఫియా పెట్రేగిపోతుందన్నారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా లభ్యమౌతోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనన్ని మద్యం బ్రాండ్లు ఏపీలోనే దొరుకుతాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఖజానా నింపుకునేందుకు వైఎస్ఆర్సీపీ పెద్దలు ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా అని ప్రశ్నించారు. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామని అధికారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని హెచ్చారించారు.

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఏపీ నాయుడు ఆధ్వర్యంలో డి.సైదావలి, పలు జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తోట సమక్షంలో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.

Also Read..

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను బర్తరఫ్ చేయండి.. గవర్నర్‌కు కాంగ్రెస్ నేత ఫిర్యాదు



Next Story

Most Viewed