బోనాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి

by Disha Web Desk 15 |
బోనాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి
X

దిశ, మెట్టుగూడ : బోనాల సందర్భంగా మెట్టుగూడ డివిజన్ పరిధిలోని దేవాలయాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తోలిబోనం సమర్పించనున్నారు. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉజ్జయినీ మహంకాళి బోనాల తర్వాత సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో బోనాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.

చిలకల గూడ కట్ట మైసమ్మ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. దాంతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే అన్ని శాఖల సమన్వయంతో అమ్మవారి ఆశీస్సులతో బోనాల జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని సిద్దం చేశారు. వాటర్ వర్క్స్ శాఖ ఆధ్వర్యంలో వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ సిద్దం చేశారు. ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది.

Next Story

Most Viewed