ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి యత్నించిన ఏబీవీపీ నాయకులు..

by Disha Web Desk 20 |
ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి యత్నించిన ఏబీవీపీ నాయకులు..
X

దిశ, కార్వాన్ : నాంపల్లి లోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని బుధవారం ఏబీవీపీ నాయకులు ముట్టడికి యత్నించారు. దీంతో కొద్దిసేపు బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ గుర్తింపు లేకుండా నడిపిస్తున్న ఇంటర్ కళాశాలలను రద్దు చేయాలని అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల యాజాన్యం పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కళాశాలలో మౌలికవసతులు కల్పించాలని ఏబీవీపి నాయకులు డిమాండ్ చేశారు. బారికేట్లను ఎక్కి ఇంటర్ బోర్డు కార్యాలయంలోనికి వెళ్లటానికి ప్రయత్నించిన వారిని పోలిసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Next Story

Most Viewed