- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాగిన మత్తులో యువకుడి వీరంగం
తాగిన మత్తులో వైన్స్ వద్ద వీరంగం సృష్టించి , పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్పై దాడి చేసిన యువకుడిని వనస్థలిపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

దిశ, వనస్థలిపురం : తాగిన మత్తులో వైన్స్ వద్ద వీరంగం సృష్టించి , పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్పై దాడి చేసిన యువకుడిని వనస్థలిపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం పరిధిలోని పనామా ప్రాంతంలో ఉండే ప్రైవేట్ ఉద్యోగి దెంది కార్తీక్రెడ్డి (27) సోమవారం రాత్రి సమీపంలోని డైమండ్ వైన్స్ వద్ద మద్యం సేవించాడు. వేరే వారితో గొడవ పడటంతో న్యూసెన్స్ చేస్తున్నాడని స్థానికులు 100కు డయల్ చేయగా.. పోలీసులు వెళ్లి స్టేషన్కు తీసుకువచ్చారు. స్టేషన్కు వచ్చినప్పటి నుంచి కార్తీక్రెడ్డి అక్కడికి వచ్చిన పబ్లిక్ ని, డ్యూటీలో ఉన్న సిబ్బందిని ఇష్టం వచ్చినట్లు తిడుతూ మళ్లీ న్యూసెన్స్ చేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నావంటూ నైట్ వాచ్ డ్యూటీలో కానిస్టేబుల్ యాదగిరి అడుగుతుండగా.. ఒక్కసారిగా తలతో కానిస్టేబుల్ తలపై బలంగా గుద్దాడు. సదరు కానిస్టేబుల్ తలకి బలమైన గాయమై రక్తస్రావమైంది. కానిస్టేబుల్ యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అలాగే వైన్స్ లో జరిగిన గొడవలో కార్తీక్రెడ్డి తనపై దాడి చేశారని కిరణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కార్తీక్ రెడ్డి, మరికొంతమందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు.






