హైదరాబాద్‌లో అమానుషం.. కూతురును అమ్ముకున్న తల్లిదండ్రులు

by Web Desk |
హైదరాబాద్‌లో అమానుషం.. కూతురును అమ్ముకున్న తల్లిదండ్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బాలికల దినోత్సవం రోజున అభం శుభం తెలియని అమ్మాయిని అంగట్లో అమ్మకానికి పెట్టారు. ఈ ఘటన బాలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్‌లో 14 ఏళ్ల అమ్మాయిని కుటుంబసభ్యులు అమ్మేశారు. రూ.5 లక్షలకు ముంబైకి చెందిన ఓ వ్యక్తి అమ్మాయిని కొనేందుకు యత్నించారు. చివరికి రూ.3 లక్షలు ముట్టజెప్పి బాలికను తీసుకెళ్తుండగా సమాచారమందుకున్న రాచకొండ పోలీసులు రంగంలోకి దిగి, బాలికను రక్షించారు. ముంబైకి చెందిన సయ్యద్‌ అల్తాఫ్‌తో పాటు మరో 8 మందిని అరెస్ట్‌ చేశారు.



Next Story

Most Viewed